తాండూర్ వీరశైవ సమాజం ఎన్నికల ప్రచారంలో వేగం
తంబాకు చంద్రశేఖర్ ప్యానల్కు సమాజ పెద్దల పూర్తి మద్దతు
15 మంది సభ్యులతో సమతుల్య ప్యానల్ ఏర్పాటు ప్రశంసనీయం
భారీ మెజార్టీతో గెలిపించాలని సమాజ సభ్యులకు పిలుపు
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజం 2026–28 ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో పూర్తి స్థాయి ప్యానల్ను ఏర్పాటు చేసిన తంబాకు చంద్రశేఖర్ ప్యానల్కు సమాజ గౌరవ పెద్దలు మరియు భజన మండలి సభ్యులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబాకు చంద్రశేఖర్ ప్యానల్ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమాజ పెద్దలు, భజన మండలి సభ్యులు మాట్లాడుతూ—15 మంది సభ్యులతో సమతుల్యంగా ప్యానల్ను రూపొందించడం సంతోషకరమని తెలిపారు. ఈ ప్యానల్ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే సమాజ సభ్యులందరూ ఐక్యంగా నిలిచి, ఈ ప్యానల్లో ఉన్న అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పెద్దలు శంభు లింగం, గాజుల వీరన్న, మాద్రిక శేఖర్, మల్కాపురం నాగభూషణం, కోటం వీరకాంతు, మేడి విజయ్ కుమార్, ఎన్కెపల్లి పర్వతప్ప తదితరులు పాల్గొన్నారు.
తంబాకు చంద్రశేఖర్ ప్యానల్కు సమాజ పెద్దల పూర్తి మద్దతు
తాండూర్ వీరశైవ సమాజం ఎన్నికల ప్రచారంలో వేగం
తంబాకు చంద్రశేఖర్ ప్యానల్కు సమాజ పెద్దల పూర్తి మద్దతు
15 మంది సభ్యులతో సమతుల్య ప్యానల్ ఏర్పాటు ప్రశంసనీయం
భారీ మెజార్టీతో గెలిపించాలని సమాజ సభ్యులకు పిలుపు
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజం 2026–28 ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో పూర్తి స్థాయి ప్యానల్ను ఏర్పాటు చేసిన తంబాకు చంద్రశేఖర్ ప్యానల్కు సమాజ గౌరవ పెద్దలు మరియు భజన మండలి సభ్యులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబాకు చంద్రశేఖర్ ప్యానల్ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమాజ పెద్దలు, భజన మండలి సభ్యులు మాట్లాడుతూ—15 మంది సభ్యులతో సమతుల్యంగా ప్యానల్ను రూపొందించడం సంతోషకరమని తెలిపారు. ఈ ప్యానల్ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే సమాజ సభ్యులందరూ ఐక్యంగా నిలిచి, ఈ ప్యానల్లో ఉన్న అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పెద్దలు శంభు లింగం, గాజుల వీరన్న, మాద్రిక శేఖర్, మల్కాపురం నాగభూషణం, కోటం వీరకాంతు, మేడి విజయ్ కుమార్, ఎన్కెపల్లి పర్వతప్ప తదితరులు పాల్గొన్నారు.
