దుర్గంచెరువు గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
- మద్యం విక్రయిస్తే భారీ జరిమానా
- ఎవరైనా అమ్మితే సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి
- బహిరంగ ప్రదేశంలో మద్యంసేవించినా,తాగి గొడవ పడినా జరిమానా తప్పదు
వికారాబాద్:వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట మండలం దుర్గంచెరువు గ్రామం సామాజిక మార్పు దిశగా కీలక అడుగు వేసింది. గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా మద్యం అమ్మకాలకు పాల్పడితే అట్టి విషయాన్ని తెలియజేసిన వారికి గ్రామ పంచాయతీ తరపున రూ.5వేల నగదు బహుమతి అందిస్తున్నట్లు ప్రకటించారు.అమ్మిన వారికి రూ. 25వేల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఇవేగాకగ్రామంలో ఎవరైనా మద్యం సేవించికుటుంబసభ్యులతో గొడవ పడినా రూ.5వేల జరిమానా,గ్రామ పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా రూ.5వేల విధించనున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.గ్రామస్తుల ఆరోగ్యం,కుటుంబాలఆర్థికస్థితిగతులు,శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల నుండి హర్షం
వ్యక్తమవుతోంది.
దుర్గంచెరువు గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
దుర్గంచెరువు గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
- మద్యం విక్రయిస్తే భారీ జరిమానా
- ఎవరైనా అమ్మితే సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి
- బహిరంగ ప్రదేశంలో మద్యంసేవించినా,తాగి గొడవ పడినా జరిమానా తప్పదు
వికారాబాద్:వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట మండలం దుర్గంచెరువు గ్రామం సామాజిక మార్పు దిశగా కీలక అడుగు వేసింది. గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా మద్యం అమ్మకాలకు పాల్పడితే అట్టి విషయాన్ని తెలియజేసిన వారికి గ్రామ పంచాయతీ తరపున రూ.5వేల నగదు బహుమతి అందిస్తున్నట్లు ప్రకటించారు.అమ్మిన వారికి రూ. 25వేల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఇవేగాకగ్రామంలో ఎవరైనా మద్యం సేవించికుటుంబసభ్యులతో గొడవ పడినా రూ.5వేల జరిమానా,గ్రామ పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా రూ.5వేల విధించనున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.గ్రామస్తుల ఆరోగ్యం,కుటుంబాలఆర్థికస్థితిగతులు,శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల నుండి హర్షం
వ్యక్తమవుతోంది.
