డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోవాలి
-20ఫిబ్రవరి.2026 న నేరుగా మాట్లాడే అవకాశం

డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోవాలి
డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోవాలి
-20ఫిబ్రవరి.2026 న నేరుగా మాట్లాడే అవకాశం
తాండూరు ఫిబ్రవరి 19 ( స్పీడ్ న్యూస్):- తాండూరు బస్ డిపో పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణికులు బస్సుల రాకపోకలపై ఎదుర్కొంటున్న సమస్యలను క్లుప్తంగా డిపో మేనేజర్ కు ఫోన్ చేసి తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ అవకాశం రేపు అనగా శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సమస్యలపై సెల్ నెంబరు 9959226251 కు ఫోన్ చేసి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని కోరారు . ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం డిపో అధికారులు సూచించిన సమయాన్ని మాత్రమే వినియోగించుకోవాలని కోరారు.
