గ్యాస్ సరఫరా పై ఆందోళన చెందవద్దు.
కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డి ఎం సి ఎస్ మురళి కృష్ణ, వ్యవసాయ అధికారి రాజారత్నం, ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్ , ఇరిగేషన్,మార్కెటింగ్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.
గ్యాస్ సరఫరా పై ఆందోళన చెందవద్దు….. కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
గ్యాస్ సరఫరా పై ఆందోళన చెందవద్దు.
కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారినిగందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి నల్ల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ఎల్.పి.జి గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు,ఎస్.పి లు,పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.పి.జి గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు.ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారిగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు,విద్యాసంస్థలకు,వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.రాష్ట్రంలో 810 ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు.ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు.అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు..తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు.ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు,ఎస్.పి లు,పోలీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు,సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డి ఎం సి ఎస్ మురళి కృష్ణ, వ్యవసాయ అధికారి రాజారత్నం, ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్ , ఇరిగేషన్,మార్కెటింగ్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.
