పూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శవంతమైన ఘట్టం

వికారాబాద్:పూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజున ఒక మరపురాని ఘట్టం చోటుచేసుకుంది.గ్రామ సర్పంచ్ పాఠశాలకు వచ్చి,విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా“నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత” అనే సందేశాన్ని సర్పంచ్ పిల్లల హృదయాల్లో నాటారు.విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి ఆరోగ్యం, ఆహార నాణ్యత,పాఠశాల వాతావరణంపై సర్పంచ్ ప్రత్యక్షంగా అవగాహన పొందారు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ..“గ్రామ భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లోనే ఉంది.వారి చదువు,ఆరోగ్యం మన అందరి బాధ్యత”అని అన్నారు.
పూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శవంతమైన ఘట్టం
పూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శవంతమైన ఘట్టం
వికారాబాద్:పూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజున ఒక మరపురాని ఘట్టం చోటుచేసుకుంది.గ్రామ సర్పంచ్ పాఠశాలకు వచ్చి,విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా“నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత” అనే సందేశాన్ని సర్పంచ్ పిల్లల హృదయాల్లో నాటారు.విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి ఆరోగ్యం, ఆహార నాణ్యత,పాఠశాల వాతావరణంపై సర్పంచ్ ప్రత్యక్షంగా అవగాహన పొందారు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ..“గ్రామ భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లోనే ఉంది.వారి చదువు,ఆరోగ్యం మన అందరి బాధ్యత”అని అన్నారు.
